జననాయగన్ సెన్సార్ వివాదంలో కీలక మలుపు, సీబీఎఫ్‌సీపై కేసు ఉపసంహరించుకున్న నిర్మాతలు

జననాయగన్ సెన్సార్ వివాదంలో కీలక మలుపు, సీబీఎఫ్‌సీపై కేసు ఉపసంహరించుకున్న నిర్మాతలు

ప్రముఖ చిత్రం ‘జననాయగన్’ సెన్సార్‌ సర్టిఫికేషన్ విషయంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) పై గతంలో దాఖలు చేసిన కేసును వెనక్కి తీసుకోవాలని చిత్ర నిర్మాతలు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వారు మద్రాస్ హైకోర్టు రిజిస్ట్రీకి అధికారిక లేఖను సమర్పించారు. చట్టపరమైన పోరాటం కంటే సెన్సార్ బోర్డు సూచించిన మార్పులు చేయడం ద్వారా సినిమాను త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చని వారు భావిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా జనవరి 9న విడుదల కావాల్సి ఉండగా, సెన్సార్ ఇబ్బందుల కారణంగా వాయిదా పడింది.

న్యాయపరమైన వివాదాలకు స్వస్తి పలికి, సినిమాలో అవసరమైన మార్పులు చేసి మరోసారి రివైజింగ్ కమిటీని సంప్రదించనున్నట్లు నిర్మాతలు ఆ లేఖలో స్పష్టం చేశారు. ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ సూచనల మేరకు సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలను సరిచేసి, క్లీన్ సర్టిఫికేట్ పొందడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఈ సానుకూల నిర్ణయంతో జననాయగన్ చిత్రం త్వరలోనే థియేటర్లలో సందడి చేసే అవకాశం కనిపిస్తోంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *