తిరుపతి లడ్డులో టాయిలెట్ క్లీనర్ కెమికల్? చంద్రబాబు సంచలన ఆరోపణలతో ప్రకంపనలు!

తిరుపతి లడ్డు తయారీలో వాడే నెయ్యిలో బాత్‌రూమ్ క్లీనర్లలో ఉపయోగించే ప్రమాదకర రసాయనం (LABSA) కలిపినట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ కల్తీ జరిగిందని, ఇది భక్తుల ప్రాణాలకు ముప్పు అని ఆయన పేర్కొన్నారు.

అయితే, ఈ ఆరోపణలను జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. సీబీఐ చార్జిషీటులో తమ పార్టీ నాయకుల పేర్లు లేవని, నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ఎక్కడా నిరూపణ కాలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ వివాదం ప్రస్తుతం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *