5 రాష్ట్రాల ఎన్నికలు: 1,444 మంది పరిశీలకులకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు!
February 6, 2026

తమిళనాడు, పశ్చిమ బెంగాల్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, 1,444 మంది కేంద్ర పరిశీలకులతో నిర్వహించిన రెండు రోజుల సమావేశం ముగిసింది. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. విధుల్లో ఎలాంటి అలసత్వం వహించకూడదని ఆయన స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ఈవీఎంల వినియోగం, వ్యయ నియంత్రణపై శిక్షణ ఇచ్చారు. కొందరు సీనియర్ అధికారులను మినహాయించాలన్న రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తిని కమిషన్ తోసిపుచ్చింది. నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ విధులకు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది.