మహిళలు బైక్‌పై ఒక వైపే కాళ్లు పెట్టి ఎందుకు కూర్చుంటారు దీని వెనుక ఉన్న అసలు కారణం ఇదీ

మహిళలు బైక్‌పై ఒక వైపే కాళ్లు పెట్టి ఎందుకు కూర్చుంటారు దీని వెనుక ఉన్న అసలు కారణం ఇదీ

మహిళలు బైక్‌పై ప్రయాణించేటప్పుడు ఒక పక్కకే కాళ్లు వేసి కూర్చోవడం మనం తరచుగా చూస్తుంటాం. దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన చారిత్రక కారణాన్ని పాకిస్థానీ బైకర్ జెనిత్ ఇర్ఫాన్ వెల్లడించారు. ఇది మన దేశీయ సంస్కృతి కాదని, 14వ శతాబ్దపు బ్రిటీష్ సంప్రదాయం నుండి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. ఆ కాలంలో మహిళలు పురుషుల మాదిరిగా కూర్చోవడం అనాగరికంగా భావించేవారు.

చరిత్ర ప్రకారం, బోహేమియా యువరాణి ఆన్ మొదటిసారిగా గుర్రపు స్వారీ చేసేటప్పుడు ఒక వైపుకే కాళ్లు వేసి కూర్చున్నారు. అప్పట్లో మహిళలు రెండు వైపులా కాళ్లు వేసి కూర్చోవడాన్ని సమాజం అశ్లీలంగా పరిగణించేది. ఆ పాత సంప్రదాయమే కాలక్రమేణా భారత్, పాకిస్థాన్ వంటి దేశాల్లో స్థిరపడిపోయింది. నేటికీ చాలా మంది మహిళలు అదే పద్ధతిని అనుసరిస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *