జపాన్ పార్లమెంటులో మహిళా టాయిలెట్ల కొరతపై ప్రధాని తకైచి సహా మహిళా ఎంపీల ఆగ్రహం

జపాన్ పార్లమెంటులో మహిళా టాయిలెట్ల కొరతపై ప్రధాని తకైచి సహా మహిళా ఎంపీల ఆగ్రహం

జపాన్ పార్లమెంటు భవనంలో మహిళా ప్రతినిధులకు కనీస సౌకర్యాలు లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దేశ తొలి మహిళా ప్రధాని సనే తకైచి ఈ సమస్యపై గళం విప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం 73 మంది మహిళా ఎంపీలు ఉన్నప్పటికీ, ప్రధాన సభ వద్ద కేవలం రెండు టాయిలెట్ క్యూబికల్స్ మాత్రమే అందుబాటులో ఉండటంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

దాదాపు 90 ఏళ్ల క్రితం అంటే 1936లో ఈ భవనాన్ని నిర్మించినప్పుడు మహిళలకు ఓటు హక్కు లేకపోవడంతో సరైన వసతులు కల్పించలేదు. 2024 ఎన్నికల్లో రికార్డు స్థాయిలో మహిళా ఎంపీలు ఎన్నికవడంతో ఈ సమస్య జటిలమైంది. ఇది కేవలం ఎంపీలకే కాకుండా అక్కడ పనిచేసే మహిళా జర్నలిస్టులు మరియు సిబ్బందికి కూడా పెద్ద సమస్యగా మారిందని ఎంపీ యాసుకో కోమియామా ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *