టెన్త్ పరీక్షల విద్యార్థులకు.Alert!

టెన్త్ పరీక్షల విద్యార్థులకు.Alert!

టెన్త్ పరీక్షలు ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈసారి పరీక్ష వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేస్తూ ప్రశ్నాపత్రంపై QR కోడ్, సీరియల్ నంబర్ ముద్రించనున్నారు.

పరీక్షార్థులకు 24 పేజీల ఆన్సర్ బుక్‌లెట్ మాత్రమే అందజేస్తారు. అదనపు షీట్లు ఇవ్వబోరని అధికారులు స్పష్టం చేశారు. పరీక్ష ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కానుంది. విద్యార్థులకు 5 నిమిషాల ఆలస్య అనుమతి మాత్రమే ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

హాల్ టికెట్లు ఇంకా పొందని విద్యార్థులు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. పరీక్షకు ముందు అన్ని సూచనలు పాటిస్తూ, సమయానికి హాజరయ్యేలా విద్యార్థులు సిద్ధంగా ఉండాలని అధికారుల సూచన.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *