ఫోన్ ట్యాపింగ్ కేసు: ఇద్దరికి రెడ్ కార్నర్ నోటీసులు
March 19, 2025

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు తిరిగింది. మాజీ SIB చీఫ్ ప్రభాకర్ రావు, ప్రముఖ మీడియా సంస్థ అధినేత శ్రవణ్ కుమార్లకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయని అధికారులు వెల్లడించారు. ఈ నోటీసుల నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థ CBI నుంచి రాష్ట్ర సీఐడీకి కీలక సమాచారం అందింది.
వారిద్దరినీ భారత్కు తిరిగి రప్పించేందుకు కేంద్ర హోంశాఖ, విదేశాంగ శాఖలతో హైదరాబాద్ పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ కేసు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతుండగా, దర్యాప్తు మరింత వేగంగా ముందుకు సాగుతోంది. ట్యాపింగ్ ఆరోపణలపై ఇప్పటికే అనేక మంది అధికారులను ప్రశ్నించిన అధికారులు, నిందితుల అరెస్ట్కు అవసరమైన అన్ని చర్యలను వేగవంతం చేశారు.