ప్రేమ వివాహం చేసుకున్న 22 రోజులకే అదే ఆలయ ప్రాంగణంలో నవ దంపతుల ఆత్మహత్య
January 2, 2026

ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లా హర్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. డిసెంబర్ 6వ తేదీన అనియా కలా గ్రామంలోని మహామాయి ఆలయంలో ప్రేమ వివాహం చేసుకున్న ఖుషీరామ్, మోహిని దంపతులు ఆదివారం ఉదయం అదే ఆలయ ప్రాంగణంలో చెట్టుకు ఉరివేసుకుని విగతజీవులుగా కనిపించారు. కేవలం 22 రోజుల క్రితం ఏ గుడిలోనైతే ఏడడుగులు వేశారో, ఇప్పుడు అదే చోట ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.
కుటుంబ సభ్యులు వీరి వివాహాన్ని అంగీకరిస్తున్న తరుణంలో ఈ నవ దంపతులు ఇంతటి దారుణ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలు లేదా మరేదైనా మానసిక ఒత్తిడి కారణంగా ఈ ఘటన జరిగిందా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.