భోజనం తర్వాత మీ బ్లడ్ షుగర్ లెవల్ ఎంత ఉండాలి డయాబెటిస్ బారిన పడకుండా ఉండాలంటే ఈ విషయాలు తెలుసుకోండి

మారుతున్న జీవనశైలి కారణంగా డయాబెటిస్ ప్రస్తుతం పెను సవాలుగా మారింది. సాధారణంగా ఆరోగ్యవంతుడైన వ్యక్తికి పరగడుపున షుగర్ లెవల్ 70-100 mg/dL మధ్య మరియు భోజనం తర్వాత 140 mg/dL కంటే తక్కువగా ఉండాలి. ఒకవేళ తిన్న రెండు గంటల తర్వాత ఈ స్థాయి 200 mg/dL లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే దానిని డయాబెటిస్గా పరిగణించాలి. అలాగే గత మూడు నెలల సగటు చక్కెర స్థాయిని తెలిపే HbA1c 6.5 శాతం కంటే ఎక్కువగా ఉంటే వెంటనే జాగ్రత్త పడాలి.
ప్రీ-డయాబెటిస్ దశలోనే అప్రమత్తమైతే జీవనశైలిలో మార్పుల ద్వారా ఈ వ్యాధిని అరికట్టవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం మరియు ప్రతిరోజూ 30 నిమిషాల వ్యాయామం చేయడం తప్పనిసరి. క్రమం తప్పకుండా బ్లడ్ షుగర్ పరీక్షలు చేయించుకోవడం మరియు ఒత్తిడికి దూరంగా ఉండటం ద్వారా డయాబెటిస్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. సరైన సమయంలో స్పందిస్తే ఆరోగ్యకరమైన భవిష్యత్తు మీ సొంతమవుతుంది.