ఐఐటీ ముంబైలో మొసలి కలకలం

ముంబై పొవాయ్ ఐఐటీ క్యాంపస్లో ఓ భారీ మొసలి సంచారం విద్యార్థులు, అధ్యాపకుల్లో భయాందోళనకు గురిచేసింది. మొసలి రోడ్డు మీదకు రావడాన్ని గమనించిన విద్యార్థులు ఒక్కసారిగా పరుగులు తీశారు. సాధారణంగా విద్యార్థులతో కిక్కిరిసే క్యాంపస్లో ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది.
సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది వెంటనే అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. హుటాహుటిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బంది అక్కడికి చేరుకుని మొసలిని పరిశీలించారు. అది స్థానికంగా ఉన్న పద్మావతి ఆలయం సరస్సు నుంచి వచ్చిందని గుర్తించారు. ఈ ఘటన మార్చి 23వ తేదీ సాయంత్రం 7 నుంచి 8 గంటల మధ్య చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
క్యాంపస్లో మొసలి సంచారం వీడియోగా రికార్డ్ చేసి కొందరు విద్యార్థులు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. ప్రస్తుతం ఆ దృశ్యాలు ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.