ఎయిర్‌లైన్స్‌కు DGCA కఠిన ఆదేశాలు – ప్రయాణికుల హక్కులపై ముందస్తు సమాచారం తప్పనిసరి

ఎయిర్‌లైన్స్‌కు DGCA కఠిన ఆదేశాలు – ప్రయాణికుల హక్కులపై ముందస్తు సమాచారం తప్పనిసరి

ఎయిర్‌లైన్స్ సంస్థలు ప్రయాణికుల హక్కుల గురించి ముందుగానే సమాచారం ఇవ్వాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కఠిన ఆదేశాలు జారీ చేసింది. టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు వాట్సాప్ లేదా SMS ద్వారా ప్యాసింజర్ ఛార్టర్ వివరాలను పంపాలని సూచించింది.

అలాగే, ఈ సమాచారాన్ని టికెట్ పై ముద్రించడం, ఎయిర్‌లైన్ వెబ్‌సైట్లలో ప్రదర్శించడం కూడా తప్పనిసరి చేసింది. ప్రయాణికులు ఫ్లైట్ ఆలస్యం, లగేజీ నష్టం వంటి సమస్యలను ఎదుర్కొన్నప్పుడు తమ హక్కులను సులభంగా వినియోగించుకునేలా ఈ చర్యలు తీసుకుంది. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే, ప్రయాణికుల అసౌకర్యాన్ని తగ్గించడంతో పాటు, ఎయిర్‌లైన్స్ బాధ్యతాయుతంగా వ్యవహరించేలా చేస్తాయని DGCA స్పష్టం చేసింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *