షేక్ హసీనాకు మరణ శిక్షకు వ్యతిరేకంగా యూనిస్ రాజీనామాకు డిమాండ్, బంగ్లాదేశ్లో ఆందోళనలు

బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మొహమ్మద్ యూనిస్ రాజీనామాను డిమాండ్ చేస్తూ, పదవి నుంచి తొలగించబడిన ప్రధానమంత్రి షేక్ హసీనాకు అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ మరణశిక్ష విధించినందుకు నిరసనగా, ఆమె పార్టీ అవామీ లీగ్ దేశవ్యాప్తంగా ప్రదర్శనలకు పిలుపునిచ్చింది. ఈ నిరసనలు నవంబర్ 30 వరకు కొనసాగుతాయి. యూనిస్ నేతృత్వంలోని ‘చట్టవిరుద్ధ’ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోర్టు ఇచ్చిన ‘హాస్యాస్పద’ తీర్పును తిరస్కరించినందుకు అవామీ లీగ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపింది.
ఈ పరిణామాల మధ్యే, వేతనాలు, పదోన్నతుల డిమాండ్లతో బంగ్లాదేశ్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు మూడు రోజుల పాటు పని నిలిపివేశారు. అలాగే, ‘బౌల్’ గాయకుడు అబుల్ సర్కార్ అరెస్టు, దైవదూషణ (Blasphemy) ఆరోపణలతో జరుగుతున్న హింస, అరెస్టులు, మూకదాడులను వెంటనే ముగించాలని కోరుతూ వందలాది మంది పౌరులు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. మతపరమైన ఉగ్రవాదం అంతం కావాలని వారు డిమాండ్ చేశారు.