4 పిల్లల తల్లి ప్రియుడితో పరార్, బస్టాండ్లో భర్తకు షాక్

మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ నుండి ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. నాలుగు మంది పిల్లల తల్లి తన భర్తను మోసం చేసి, తన ప్రియుడితో పారిపోయింది. 11 సంవత్సరాల క్రితం రాజారామ్ను వివాహం చేసుకున్న రామ్దేవి అనే మహిళ, ఐదేళ్లుగా తన బంధువు అయిన సునీల్ శ్రీవాస్తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఢిల్లీ నుండి తమ స్వగ్రామానికి తిరిగి వస్తున్న క్రమంలో, గురువారం ఉదయం ఛతర్పూర్ బస్టాండ్లో ఈ సంఘటన జరిగింది.
భర్తను పిల్లలను టాయిలెట్కు తీసుకెళ్లమని చెప్పి రామ్దేవి తన ప్రియుడు సునీల్తో పారిపోయినట్లు తెలిసింది. కూతురి పెళ్లి కోసం దాచుకున్న రూ. 74,000 నగదును కూడా ఆమె తనతో తీసుకువెళ్ళిందని భర్త రాజారామ్ ఆరోపించారు. రాజారామ్ సిటీ కోత్వాలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, స్టేషన్ ఇన్చార్జ్ అరవింద్ కుజూర్ దర్యాప్తు చేసి తగిన చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా, రామ్దేవి తల్లిదండ్రులు ఆమెతో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.