3500 ఏళ్ల క్రితం వింత పద్ధతి, పుట్టబోయేది ఆడో మగో అప్పుడే ఇలా కనిపెట్టేవారు

నేటి ఆధునిక కాలంలో అల్ట్రాసౌండ్ వంటి సాంకేతికతలు అందుబాటులో ఉన్నాయి, కానీ 3500 ఏళ్ల క్రితమే గర్భంలో ఉన్నది బిడ్డ అని తెలుసుకోవడానికి ఈజిప్ట్ మరియు బాబిలోన్ నాగరికతలలో ఒక వింత పద్ధతిని అనుసరించేవారు. దీనిని ‘గోధుమ మరియు బార్లీ మొలకల పరీక్ష’ అని పిలిచేవారు. గర్భిణీ స్త్రీ మూత్రాన్ని గోధుమ మరియు బార్లీ గింజలపై పోసేవారు. ఒకవేళ గోధుమ గింజలు ముందుగా మొలకెత్తితే ఆడబిడ్డ అని, బార్లీ గింజలు ముందుగా మొలకెత్తితే మగబిడ్డ పుడతారని ఆ కాలంలో ప్రజలు బలంగా విశ్వసించేవారు. గింజలు మొలకెత్తకపోతే ఆమె గర్భవతి కాదని భావించేవారు.
ఈ పురాతన పద్ధతిపై 20వ శతాబ్దంలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయగా, మూత్రంలోని హార్మోన్లు గింజల పెరుగుదలపై ప్రభావం చూపుతాయని, అందుకే ఆ కాలంలో ఈ అంచనాలు కొంతవరకు నిజమయ్యే అవకాశం ఉందని తేలింది. అయితే ప్రస్తుత వైద్య శాస్త్రం ప్రకారం ఈ పద్ధతి పూర్తిగా విశ్వసనీయమైనది కాదు. కేవలం చారిత్రక మరియు సాంస్కృతిక ఆసక్తి కోసమే ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. భారతదేశంలో పుట్టబోయే బిడ్డ లింగ నిర్ధారణ చేయడం చట్టరీత్యా నేరం అనే విషయాన్ని గుర్తించుకోవాలి.