2 గోల్గప్పల కోసం ట్రాఫిక్ను అడ్డుకున్న మహిళ, రోడ్డుపై కూర్చుని ఏడ్చిన వైనం
September 19, 2025

గుజరాత్లోని వడోదరలో సురసాగర్ లేక్ వద్ద ఒక వింత సంఘటన జరిగింది. ఒక మహిళ రోడ్డుపై నిరసన వ్యక్తం చేయడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. ఒక గోల్గప్పా బండి అతను ఆమెకు ₹20కి ఆరుకు బదులుగా నాలుగు గోల్గప్పాలను మాత్రమే ఇచ్చాడన్నది ఆమె ఫిర్యాదు. ఆమె తన రెండు అదనపు గోల్గప్పల కోసం ఏడుస్తూ, రోడ్డుపై నుంచి కదలడానికి నిరాకరించింది.
ఆ మహిళ నిరసన చూడటానికి జనం గుమిగూడారు. ఆమె రోడ్డుపై కూర్చోవడంతో చాలాసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని రోడ్డును క్లియర్ చేశారు. ఆ మహిళకు అదనపు గోల్గప్పలు దక్కాయో లేదో మాత్రం తెలియదు.