₹లక్ష దాటిన వెండి ఇన్వెస్టర్లకు సూపర్ ఛాన్స్: జిమీత్

₹లక్ష దాటిన వెండి ఇన్వెస్టర్లకు సూపర్ ఛాన్స్: జిమీత్

వెండి ధరలు జీవితకాల గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో ఇన్వెస్టర్లకు మంచి అవకాశాలు లభిస్తాయని శామ్కో వెంచర్స్ CEO జిమీత్ మోదీ తెలిపారు. గత అనుభవాలను పరిశీలిస్తే, వెండి ప్రతి గరిష్ఠ స్థాయిని అధిగమించినప్పుడు మంచి రాబడిని ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. గత 3, 6, 12 నెలల గణాంకాల ప్రకారం వెండి 61%, 62%, 83% స్ట్రైక్ రేటుతో వరుసగా 21%, 31%, 28% సగటు రాబడిని అందించిందని తెలిపారు.

కోవిడ్ సమయాన్ని మినహాయిస్తే, వెండి-బంగారం రేషియో 30 ఏళ్ల కనిష్ఠమైన 1.09% వద్ద కొనసాగుతుండటం మార్కెట్లో బుల్లిష్ ధోరణిని సూచిస్తోందని జిమీత్ మోదీ అన్నారు. దీని వల్ల వెండిలో పెట్టుబడి పెట్టే వారికి మంచి లాభాలు వచ్చే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టేవారికి ఇది ఒక రకాల గోల్డెన్ ఛాన్స్ అని అభిప్రాయపడుతున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *