సైబర్ ముఠాల వలలో చిక్కుకున్న 589 మంది భారతీయుల రక్షణ!

సైబర్ ముఠాల వలలో చిక్కుకున్న 589 మంది భారతీయుల రక్షణ!

సైబర్ నేరగాళ్ల బారినపడి భయంకర అనుభవాలు ఎదుర్కొన్న 589 మంది భారతీయులను కేంద్ర ప్రభుత్వం రక్షించింది. ఉద్యోగాల ఆశతో మయన్మార్, థాయ్‌లాండ్ వెళ్లిన వారు అకారణంగా సైబర్ ముఠాల చేతిలో చిక్కుకుని అమానుష పరిస్థితులు ఎదుర్కొన్నారు. మోసపోయిన బాధితులు తెలియకుండానే ఆన్‌లైన్ మోసాలకు బలయ్యేలా చేశారు. వీసాలు లాక్కోవడంతోపాటు లక్ష్యాలు చేరుకోకపోతే తీవ్ర శిక్షలు అమలు చేశారు.

తెలంగాణకు చెందిన ఓ బాధితుడు తన భయంకర అనుభవాన్ని వివరించాడు. “నిర్దిష్ట టార్గెట్లు చేరుకోకపోతే ఎండలో నాలుగు కిలోమీటర్లు పరిగెత్తించేవారు. శారీరక శిక్షలతో పాటు పుష్‌అప్స్ చేయించేవారు. అంతేకాకుండా, పాడైపోయిన బాతు గుడ్లు తినిపించేవారు” అని BBCతో వివరించారు. ఈ ఘటన నిరుద్యోగులను వేధిస్తున్న నకిలీ ఉద్యోగాల ముఠాల పై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *