సేవా తీర్థ్ వేదికగా ప్రధాని మోదీ సంచలన నిర్ణయాలు నాలుగు కీలక పథకాలపై తొలి సంతకాలు చేస్తూ పాలన ప్రారంభం
February 14, 2026

ఢిల్లీలో పీఎంఓ, క్యాబినెట్ మరియు జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్లతో కూడిన ‘సేవా తీర్థ్’ నూతన కార్యాలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. పరిపాలనా జాప్యాన్ని నివారించి, ప్రభుత్వ కార్యకలాపాలను ఒకే చోట సులభతరం చేసేలా ఈ అత్యాధునిక భవన సముదాయాన్ని రూపొందించారు.
బాధ్యతలు చేపట్టిన వెంటనే మోదీ నాలుగు కీలక దస్త్రాలపై సంతకాలు చేశారు. రోడ్డు ప్రమాద బాధితులకు 1.5 లక్షల ఉచిత వైద్యం, 2029 నాటికి 6 కోట్ల మంది లక్షాధికారి దీదీల లక్ష్యం మరియు వ్యవసాయ మౌలిక నిధిని 2 లక్షల కోట్లకు పెంచుతూ ప్రజోపయోగ నిర్ణయాలు తీసుకున్నారు.