వైద్యం పేరుతో రోగుల నుంచి డబ్బులు గుంజుతున్నారు మమతా మోహన్ దాస్ సంచలన వ్యాఖ్యలు
February 14, 2026

క్యాన్సర్ చికిత్స విషయంలో భారతీయ వైద్య వ్యవస్థపై నటి మమతా మోహన్ దాస్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అమెరికాలో రోగి మానసిక స్థితికి ప్రాధాన్యత ఇస్తారని, కానీ మన దేశంలో డాక్టర్లు కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్నారని ఆమె విమర్శించారు.
ఇమ్యునో థెరపీ వంటి ఖరీదైన చికిత్సలు సామాన్యులకు అందకుండా చేస్తున్నారని ఆమె ఆవేదన చెందారు. సరైన సమాచారం ఇవ్వకుండా రోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఆసుపత్రుల యాజమాన్యాలు లాభాల కోసమే చూస్తున్నాయని మమత ఘాటుగా స్పందించారు.