లడాఖ్లో శక్తివంతమైన భూకంపం – కశ్మీర్ వరకు ప్రకంపనలు
March 14, 2025

లడాఖ్లోని కార్గిల్లో శుక్రవారం రాత్రి 2:50 గంటలకు 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంప ప్రభావం లడాఖ్తో పాటు కశ్మీర్లోనూ కనిపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ సమాచారం ప్రకారం, భూకంప కేంద్రం భూమికి 15 కిలోమీటర్ల లోతులో ఉంది.
భూకంపం సంభవించగానే ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఇప్పటి వరకు పెద్దగా నష్టం జరిగినట్లు సమాచారం లేదు. లేహ్, లడాఖ్ ప్రాంతాలు సిస్మిక్ జోన్-4 కింద వస్తాయి, అంటే ఇవి తరచూ భూకంపాలు సంభవించే ప్రాంతాలు. గత నెల రోజులలోనే ఈ ప్రాంతంతో పాటు నేపాల్, అస్సాం, భూటాన్లలో కూడా భారీ భూకంపాలు సంభవించాయి.