రాష్ట్రంలో పవర్ కట్స్.. KTR ఫైర్

తెలంగాణలో కొనసాగుతున్న విద్యుత్ సమస్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో స్పందించారు. ముఖ్యంగా పదోతరగతి పరీక్షల సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను హైలైట్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఒక విద్యార్థి తండ్రి తన కుమారుడు పవర్ కట్ కారణంగా ఎదుర్కొన్న సమస్యను కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దాదాపు మూడు గంటల పాటు విద్యుత్ లేకపోవడంతో, ఆ విద్యార్థి మొబైల్ ఫోన్ టార్చ్ ద్వారా మరియు కారులో లైట్లు వేసుకొని చదవాల్సి వచ్చింది.
ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన కేటీఆర్, కాంగ్రెస్ పాలనను తీవ్రంగా విమర్శించారు. “కాంగ్రెస్-కరెంట్ ఒకచోట కలిసి ఉండలేవు” అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే విద్యార్థులు, ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజలు ఇలాంటి సమస్యలు ఎదుర్కొనకుండా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.