యూపీఐ, ఏటీఎంల ద్వారా పీఎఫ్ విత్‌డ్రా సులభం!

యూపీఐ, ఏటీఎంల ద్వారా పీఎఫ్ విత్‌డ్రా సులభం!

ఉద్యోగుల భవిష్యత్ నిధి (PF) నిధులను ఇకపై సులభంగా ఉపసంహరించుకునే అవకాశం కల్పించేందుకు ఈపీఎఫ్‌ఓ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనుంది. జూన్ నుంచి యూపీఐ (UPI) మరియు ఏటీఎంల (ATM) ద్వారా పీఎఫ్ నిధులను డైరెక్ట్‌గా విత్‌డ్రా చేసుకునే సౌకర్యం అందుబాటులోకి రాబోతోంది. కార్మిక శాఖ కార్యదర్శి సుమిత్రా దావ్రా ఈ విధానం మే-జూన్ నాటికి అమలవుతుందని ధృవీకరించారు. ఈ సదుపాయంతో, 1 లక్ష రూపాయల వరకు ఆటోమేటెడ్‌ సిస్టమ్ ద్వారా డైరెక్ట్‌ తీసుకోవచ్చు లేదా కోరుకున్న అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేయవచ్చు. అదేవిధంగా, యూపీఐ ఆప్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్‌ను కూడా చెక్ చేసుకోవచ్చు.

ఈపీఎఫ్‌ఓ డిజిటల్‌ రంగంలో గణనీయమైన ముందడుగు వేసిందని దావ్రా తెలిపారు. 120 కంటే ఎక్కువ డేటాబేస్‌లను ఏకీకృతం చేసి, క్లెయిమ్ ప్రాసెసింగ్ సమయాన్ని కేవలం 3 రోజులకు తగ్గించారు. ప్రస్తుతం 95% క్లెయిమ్‌లు ఆటోమేటెడ్‌గా ప్రాసెస్ అవుతున్నాయి. ఈ కొత్త సదుపాయం లక్షలాది ఉద్యోగులకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుందని శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *