భారత్ ఆనకట్టలు నిర్మిస్తే యుద్ధమే, బిలావల్ భుట్టో హెచ్చరిక

సింధు జలాల ఒప్పందంపై పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ భారత్కు మరోసారి గట్టి హెచ్చరిక జారీ చేశారు. భారత్ ఈ ఒప్పందాన్ని నిలిపివేసి, సింధు నదిపై ఆనకట్టలు నిర్మించడం ప్రారంభిస్తే, పరిస్థితి యుద్ధానికి దారితీయవచ్చని ఆయన స్పష్టం చేశారు. నది నీటి ప్రవాహాన్ని ఆపడానికి భారత్ ప్రయత్నిస్తే, పాకిస్థాన్ దానిని యుద్ధ ప్రకటనగా భావిస్తుందని బిలావల్ పేర్కొన్నారు.
ఇటీవల భారత ప్రభుత్వం సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని నిర్ణయించుకుంది, ఇది ఇస్లామాబాద్ను ఆగ్రహానికి గురిచేసింది. ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ ప్రతీకార వైమానిక దాడులు చేసింది, ఇందులో పాకిస్థాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన తర్వాత భారత్ ఒప్పందంపై కఠిన వైఖరి తీసుకుంది. ఈ ఉద్రిక్త వాతావరణంలో బిలావల్ చేసిన వ్యాఖ్యలు భారత్-పాకిస్తాన్ సంబంధాలను మరింత క్లిష్టతరం చేస్తున్నాయి.