బర్డ్ ఫ్లూ మళ్లీ విజృంభణ – నల్గొండ జిల్లాలో హైఅలర్ట్!

బర్డ్ ఫ్లూ మళ్లీ విజృంభణ – నల్గొండ జిల్లాలో హైఅలర్ట్!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో బర్డ్ ఫ్లూ మళ్లీ విజృంభిస్తోంది. కొంతకాలంగా తగ్గుముఖం పట్టిన ఈ వైరస్ మరోసారి గుండ్రాంపల్లి, భూదాన్ పోచంపల్లి మండలంలోని దోతిగూడెం ప్రాంతాల్లో ప్రత్యక్షమైంది. పశుసంవర్ధక శాఖ అధికారులు వెంటనే అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. వ్యాధి వ్యాప్తిని అడ్డుకునేందుకు బయోసేఫ్టీ టీములు భారీ స్థాయిలో చర్యలు తీసుకుంటున్నాయి.

సంగతి తెలుసుకున్న అధికార యంత్రాంగం సంబంధిత ప్రాంతాన్ని రెడ్ జోన్గా ప్రకటించింది. వైరస్ మరింత వ్యాపించకుండా ముందస్తు చర్యల్లో భాగంగా 2 లక్షల కోళ్లను తొలగించారు. కోళ్ల ఫుడ్, వ్యర్థాలను పూర్తిగా తొలగించి పరిసరాలను శుభ్రం చేస్తున్నారు. ప్రజలు అసహజమైన కోళ్ల మరణాలను గమనిస్తే తక్షణమే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు స్పష్టం చేశారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *