ప్రపంచకప్ విజయం తర్వాత భారత్ తదుపరి సిరీస్ ప్రకటన! లంకతో ఆడనున్న స్మృతి మంధానా?

ప్రపంచకప్ను గెలుచుకున్న భారత మహిళల క్రికెట్ జట్టు తదుపరి అంతర్జాతీయ సిరీస్ను బీసీసీఐ (BCCI) ప్రకటించింది. హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని జట్టు త్వరలో శ్రీలంకతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. ప్రస్తుతం సెలవులో ఉన్న క్రీడాకారిణులు ఈ సిరీస్తో మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నారు. డిసెంబర్ 21న విశాఖపట్నంలో తొలి మ్యాచ్తో ఈ సిరీస్ ప్రారంభమవుతుంది.
ఐదు మ్యాచ్ల ఈ టీ20 సిరీస్లో మొదటి రెండు మ్యాచ్లు విశాఖపట్నంలో, మిగిలిన మూడు మ్యాచ్లు తిరువనంతపురంలో జరగనున్నాయి. చివరి మ్యాచ్ డిసెంబర్ 30న జరగనుంది. ప్రపంచకప్ తర్వాత భారత్కు ఇదే తొలి సిరీస్ కావడంతో, భారత జట్టు సిరీస్ను గెలవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అయితే, ఇటీవల వ్యక్తిగత జీవిత సమస్యల కారణంగా వార్తల్లో నిలిచిన స్టార్ బ్యాటర్ స్మృతి మంధానా ఈ సిరీస్లో పాల్గొంటుందా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఈ సిరీస్ కోసం భారత జట్టును త్వరలోనే ప్రకటించనున్నారు.