పాపం భువీ.. SRH ఫ్యాన్స్ ఆందోళన
March 23, 2025

RCB మరియు KKR మధ్య జరిగిన మ్యాచ్లో భారత అనుభవజ్ఞుడైన పేసర్ భువనేశ్వర్ కుమార్ను బెంచ్కే పరిమితం చేశారు. RCB తుది జట్టులో అతనికి చోటు కల్పించకపోవడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. భువీ ఏళ్లుగా SRH జట్టులో కీలక ఆటగాడిగా నిలిచాడు. కానీ తాజా సీజన్లో RCBలో చోటు దక్కినా, మొదటి మ్యాచ్లో ఆడే అవకాశం దక్కకపోవడం ఫ్యాన్స్లో ఆందోళన రేపుతోంది.
ఈ ఘటనపై SRH అభిమానులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. “SRHలోనే ఉంటే భువీ బెంచ్కే పరిమితం కాకుండా, జట్టులో ఉండేవాడు” అంటూ కామెంట్లు చేస్తున్నారు. RCB యాజమాన్యం అతనికి అవకాశం ఇవ్వాలని, వచ్చే మ్యాచ్లో భువీ తుది జట్టులో ఉండాలని కోరుతున్నారు. గత దశాబ్దం నుంచి SRH తరఫున భువీ నిలకడగా రాణించిన విషయం తెలిసిందే. ఇప్పుడు RCBలో అతనికి గౌరవం దక్కుతుందా లేదా అనేది చూడాలి.