నెహ్రూ పంచశీల ఒప్పందం చారిత్రక తప్పిదమని తేల్చిచెప్పిన సీడీఎస్ అనిల్ చౌహాన్

1954లో చైనాతో నెహ్రూ కుదుర్చుకున్న పంచశీల ఒప్పందం భారత్కు సరిహద్దు సమస్యలను మిగిల్చిందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ విశ్లేషించారు. డెహ్రాడూన్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ టిబెట్ను చైనాలో భాగంగా గుర్తించడం ద్వారా సరిహద్దు సమస్యలు పరిష్కారమవుతాయని భారత్ భావించిందని తెలిపారు. అయితే చైనా దీనిని కేవలం వాణిజ్య ఒప్పందంగానే చూస్తూ వ్యూహాత్మకంగా భారత్ను దెబ్బతీసిందని ఆయన స్పష్టం చేశారు.
బ్రిటిష్ పాలన తర్వాత సరిహద్దుల నిర్ణయంలో జరిగిన లోపాలు మరియు టిబెట్ అనే బఫర్ జోన్ అదృశ్యం కావడం నేటి ఉద్రిక్తతలకు కారణమని ఆయన పేర్కొన్నారు. భారత్ శాంతిని ఆకాంక్షించినప్పటికీ చైనా కుయుక్తులను అప్పట్లో అంచనా వేయలేకపోయామని అనిల్ చౌహాన్ అభిప్రాయపడ్డారు. ఈ చారిత్రక తప్పిదం కారణంగానే నేటికీ వాస్తవాధీన రేఖ వద్ద హిమాలయ ప్రాంతం అత్యంత సున్నితంగా మారి దేశ భద్రతకు సవాలుగా నిలుస్తోందని ఆయన వివరించారు.