దేశంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థినులకు ఉచిత శానిటరీ ప్యాడ్లు పంపిణీ చేయాలని సుప్రీంకోర్టు సంచలన తీర్పు

దేశంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థినులకు ఉచిత శానిటరీ ప్యాడ్లు పంపిణీ చేయాలని సుప్రీంకోర్టు సంచలన తీర్పు

పాఠశాల విద్యార్థినుల రుతుక్రమ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలన్నీ విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ ప్యాడ్లను అందించాలని జస్టిస్ జె.బి. పార్దివాలా మరియు జస్టిస్ ఆర్. మహదేవన్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ సమస్యను అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా పరిగణించాలని రాష్ట్రాలకు సూచించింది.

దీనితో పాటు, ప్రతి పాఠశాలలో బాలురు మరియు బాలికలకు విడివిడిగా మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ నిబంధనలను పాటించని పాఠశాలల గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించింది. 2024లో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం, విద్యార్థినుల ఆరోగ్యం మరియు విద్యను దృష్టిలో ఉంచుకుని ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *