తెలంగాణ జనగణనపై కేబినెట్ కీలక నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డి భారీ కార్యాచరణ

తెలంగాణ జనగణనపై కేబినెట్ కీలక నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డి భారీ కార్యాచరణ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో 2027 జనగణనపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గైర్హాజరైన ఈ సమావేశంలో, సీఎస్ రామకృష్ణారావు కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రెండు దశల ప్రక్రియను వివరించారు. ఈ బృహత్తర కార్యక్రమం కోసం ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

మే 11 నుంచి జూన్ 9 వరకు మొదటి దశ హౌస్ లిస్టింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇందుకోసం 89 వేల మంది సిబ్బందిని ప్రభుత్వం కేటాయించింది. కేంద్రం సూచించిన 34 ప్రశ్నలతో కూడిన ఈ సేకరణ అనంతరం, 2027 ఫిబ్రవరిలో రెండో దశ జనగణన ప్రారంభం కానుందని మంత్రివర్గం వెల్లడించింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *