డీలిమిటేషన్పై HYDలో బహిరంగ సభ: రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీలిమిటేషన్పై కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాలను మోసం చేస్తూ, తమ సొంత ఎజెండాతో ముందుకెళ్తున్న బీజేపీకి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నామని ఆయన తెలిపారు. త్వరలోనే హైదరాబాద్లో డీలిమిటేషన్పై భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ సమస్య కేవలం దక్షిణాది పార్టీలకే పరిమితం కాకుండా, ప్రజల భవిష్యత్తును ప్రభావితం చేసే అంశమని స్పష్టం చేశారు.
చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ, తమిళనాడు సీఎం స్టాలిన్తో కలిసి ఈ పోరాటాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నామని రేవంత్ తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలన్నింటినీ కలిసి ముందుకు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. డీలిమిటేషన్ ప్రక్రియలో న్యాయం జరిగేలా కృషి చేస్తామని, ప్రజల హక్కులను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.