టెన్త్ విద్యార్థులకు ఉచిత బస్సు సేవలు

టెన్త్ విద్యార్థులకు ఉచిత బస్సు సేవలు

టెన్త్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి ఉచితంగా ఆర్టీసీ బస్సులను అందుబాటులోకి తెచ్చినట్టు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. విద్యార్థులు అరగంట ముందుగా ఎగ్జామ్ సెంటర్లకు చేరుకుని ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఆయన సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, తల్లిదండ్రుల ఆశల్ని నెరవేర్చేలా కృషి చేయాలని విద్యార్థులను ఉద్బోధించారు.

రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6.15 లక్షల మంది విద్యార్థులు టెన్త్ పబ్లిక్ పరీక్షలు రాయబోతున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది. ఉచిత బస్సు సౌకర్యం వల్ల దూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు ప్రయాణ సమస్యలు తలెత్తకుండా పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకునే అవకాశం లభించనుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *