టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్ వేదికల మార్పుపై ఐసీసీ కీలక నిర్ణయం
February 24, 2026

2026 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ వేదికలు మారే అవకాశం ఉందని ఐసీసీ వెల్లడించింది. పాకిస్థాన్ సెమీస్కు చేరితే కోల్కతాకు బదులుగా కొలంబోలో ఆడుతుంది. ఒకవేళ శ్రీలంక క్వాలిఫై అయితే కొలంబోలో, భారత్ క్వాలిఫై అయితే ముంబైలో తమ మ్యాచ్లు ఆడేలా ‘ఫ్లోటింగ్’ షెడ్యూల్ను రూపొందించారు.
ఒకవేళ భారత్, పాకిస్థాన్ లేదా శ్రీలంక జట్లు సెమీస్ చేరకపోతే, ముందుగా నిర్ణయించిన ప్రకారం కోల్కతా మరియు ముంబైలలోనే మ్యాచ్లు జరుగుతాయి. భద్రతా కారణాలు మరియు సహ-ఆతిథ్య దేశం శ్రీలంక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేసినట్లు సమాచారం.