చీనాబ్ నది ప్రాజెక్టుపై పాకిస్థాన్ ఆందోళన
February 13, 2026

జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ జిల్లాలో నిర్మిస్తున్న 1,856 మెగావాట్ల స్వాల్కోట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుపై పాకిస్థాన్ మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది. 1960 నాటి సింధు జలాల ఒప్పందం ప్రకారం ఈ ప్రాజెక్టు వివరాలను అందజేయాలని కోరుతూ భారత సింధు జలాల కమిషనర్కు పాక్ లేఖ రాసింది. గతేడాది భారత్ ఈ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి.
ఈ ఏకపక్ష నిర్ణయం చట్టపరమైన వాస్తవాలను మార్చలేదని, అంతర్జాతీయ స్థాయిలో ఈ వివాదాన్ని పరిష్కరించుకుంటామని పాక్ విదేశాంగ శాఖ పేర్కొంది. అయితే, జమ్మూ కాశ్మీర్ ఇంధన అవసరాలను తీర్చడంలో ఈ స్వాల్కోట్ ప్రాజెక్టు అత్యంత వ్యూహాత్మకమైనదిగా భారత్ భావిస్తోంది. చీనాబ్ నది సహజ ప్రవాహానికి అడ్డుపడకుండానే ఈ భారీ విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు.