గర్భధారణ సమయంలో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే బిడ్డ మెదడుపై ప్రభావం చూపే ప్రమాదం

గర్భధారణ సమయంలో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే బిడ్డ మెదడుపై ప్రభావం చూపే ప్రమాదం

గర్భధారణ సమయంలో మధుమేహం కేవలం తల్లి ఆరోగ్యానికే కాక పుట్టబోయే బిడ్డ మెదడు ఎదుగుదలకు కూడా ముప్పుగా మారుతోంది. తల్లి రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే భవిష్యత్తులో ఆ బిడ్డకు ఫిట్స్ లేదా ఎపిలెప్సీ వచ్చే అవకాశం 30 నుండి 40 శాతం వరకు పెరుగుతుందని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా గర్భం దాల్చిన మొదటి ఎనిమిది వారాలలో చక్కెర నియంత్రణలో లేకపోతే అది పిండం యొక్క నాడీ వ్యవస్థ నిర్మాణంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

అధిక గ్లూకోజ్ ప్లాసెంటా ద్వారా బిడ్డ శరీరంలోకి ప్రవేశించి మెదడులో వాపును కలిగిస్తుందని వైద్య నిపుణులు వివరిస్తున్నారు. అయితే సరైన ప్రణాళిక, క్రమం తప్పకుండా గ్లూకోజ్ పర్యవేక్షణ మరియు వైద్యుల సూచన మేరకు ఇన్సులిన్ థెరపీ తీసుకోవడం ద్వారా ఈ ప్రమాదాన్ని అరికట్టవచ్చు. బిడ్డ పుట్టిన తర్వాత హైపోగ్లైసీమియా బారిన పడకుండా జాగ్రత్త వహించాలని మరియు గర్భధారణ సమయంలో అanomaly స్కాన్ వంటి పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *