కొత్త మొబైల్ ఆశ చూపి 15 ఏళ్ల బాలిక అండాల దొంగతనం, ప్రయాగ్‌రాజ్‌లో వెలుగుచూసిన దారుణమైన ముఠా ఉదంతం

కొత్త మొబైల్ ఆశ చూపి 15 ఏళ్ల బాలిక అండాల దొంగతనం, ప్రయాగ్‌రాజ్‌లో వెలుగుచూసిన దారుణమైన ముఠా ఉదంతం

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో పేద మహిళలే లక్ష్యంగా సాగుతున్న ఒక అండాల విక్రయ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఒక హోటల్‌లో పనిచేస్తున్న 15 ఏళ్ల బాలికకు కొత్త మొబైల్ ఫోన్ కొనుక్కునేందుకు 10 వేల రూపాయలు ఇస్తామని ఆశ చూపి, ఆమె అండాలను అక్రమంగా సేకరించినట్లు తేలింది. మైనర్ల నుంచి అండాల సేకరణ నేరం కావడంతో, ఆ ముఠా బాలికకు నకిలీ ఆధార్ కార్డును సృష్టించి, ఆమెకు వివాహం జరిగినట్లు తప్పుడు పత్రాలు తయారు చేసి ఒక ఐవీఎఫ్ సెంటర్‌లో ప్రవేశపెట్టింది.

బాలిక తల్లి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో బాలిక స్నేహితురాలు పలక్, ఆమె తల్లి రింకీతో పాటు ఐవీఎఫ్ సెంటర్ ఏజెంట్ కల్పన భారతి కూడా ఉన్నారు. ఆర్థికంగా వెనుకబడిన మహిళలను మరియు విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా నగరంలోని వివిధ ప్రాంతాల్లో నెట్‌వర్క్ నిర్వహిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నిరుపేద మహిళల అవసరాలను ఆసరాగా చేసుకుని సాగుతున్న ఈ దారుణమైన దందాపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *