కొత్త డీజీపీ ఎంపికపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు
March 23, 2025

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త డీజీపీ నియామకంపై కీలక అడుగులు వేస్తోంది. ఇందుకోసం ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను కేంద్రానికి పంపింది. ఈ లిస్టులో రాజేంద్రనాథ్ రెడ్డి, మాదిరెడ్డి ప్రతాప్, హరీశ్ కుమార్ గుప్తా, కుమార్ విశ్వజిత్, సుబ్రహ్మణ్యం ఉన్నారు. అయితే, నియమ నిబంధనల ప్రకారం, వీరిలో ముగ్గురి పేర్లను కేంద్రం తిరిగి రాష్ట్రానికి పంపనుంది. తదుపరి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనుంది.
ప్రస్తుతం ఇన్ఛార్జ్ డీజీపీగా ఉన్న హరీశ్ కుమార్ గుప్తాను మరో రెండేళ్లు అదే పదవిలో కొనసాగించాలనే యోచనలో ప్రభుత్వం ఉందని విశ్వసనీయ సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కొత్త డీజీపీ ఎంపిక రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకున్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఏవిధంగా ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది.