కూతురు కిడ్నాప్ అయిందని తండ్రి ఫిర్యాదు కానీ ఫేస్బుక్లో పెళ్లి చేసుకున్నానంటూ షాకిచ్చిన యువతి

బీహార్లోని వైశాలి జిల్లాలో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. తన కుమార్తె కనిపించడం లేదని, ఎవరో కిడ్నాప్ చేశారని ఒక తండ్రి గోరౌల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసు నమోదైన వెంటనే ఆ యువతి సోషల్ మీడియా వేదికగా అసలు నిజాన్ని వెల్లడించింది. తాను క్షేమంగా ఉన్నానని, తన ఇష్టప్రకారమే పెళ్లి చేసుకున్నానని ఫేస్బుక్లో ‘గాట్ మ్యారీడ్’ అని స్టేటస్ పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.
వైరల్ అవుతున్న వీడియోలో ఆ యువతి ఒక యువకుడితో కలిసి కనిపిస్తూ, తన తండ్రి చేసిన కిడ్నాప్ ఆరోపణలు అబద్ధమని స్పష్టం చేసింది. తాను మేజర్ అని, తన ఇష్టానుసారమే ఈ నిర్ణయం తీసుకున్నానని చెబుతూ పోలీసుల రక్షణ కోరింది. కుటుంబ సభ్యులు తనను ఇబ్బంది పెట్టవద్దని ఆమె ఆ వేడుకలో కోరింది. ప్రస్తుతం కిడ్నాప్ కేసు మరియు యువతి వీడియో ఆధారంగా పోలీసులు ఈ ప్రేమ వ్యవహారంపై లోతైన విచారణ జరుపుతున్నారు.