కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ఖాయమా? 48 గంటల్లో హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకోబోతోందా

కాంగ్రెస్ పాలిత కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. రెండున్నర ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ముఖ్యమంత్రిని మార్చబోతున్నారనే ఊహాగానాలు పెరిగాయి. అధికార భాగస్వామ్య ఒప్పందంపై చర్చలు జోరందుకున్నాయి. ఈ ఉత్కంఠ మధ్య, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. వచ్చే 48 గంటలు అత్యంత కీలకం కానున్నాయని ఆయన స్పష్టంగా సూచించారు.ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో చర్చిస్తానని ఖర్గే ధృవీకరించారు. డిసెంబర్ 1 నాటికి ఈ విషయంపై పూర్తి స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు తమ సమస్యలను ఖర్గే వినిపించుకున్నారని, శివకుమార్ త్వరలోనే ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు, సీఎం సిద్ధరామయ్య మద్దతుదారులు కూడా చురుగ్గా ఉన్నారు. ఈ అంతర్గత గందరగోళానికి ఢిల్లీలోని హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుంది.