ఒకే రోజున మూడు జట్లతో పోటీకి సిద్ధం – స్టార్క్

ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ భారత క్రికెట్ బలాన్ని ప్రశంసిస్తూ, “భారత్ ఒకే రోజున మూడు విభిన్న ఫార్మాట్లలో మూడు విభిన్న జట్లను పోటీకి దింపగలదు” అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఈసారి ఐపీఎల్లో డిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడేందుకు సిద్ధమైన స్టార్క్, ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీకి గాయాల కారణంగా దూరమయ్యాడు. అయితే, ఇప్పుడు ఐపీఎల్లో ఆడాలని ఉత్సుకతతో ఉన్నాడు. భారతదేశానికి వచ్చిన తర్వాత జరిగిన మీడియా సమావేశంలో, “భారతదేశం ఒకే సమయంలో తన టెస్ట్ జట్టును ఆస్ట్రేలియాలో, వన్డే జట్టును దక్షిణాఫ్రికాలో, మరియు టీ-20 జట్టును మరొక దేశంలో ఆడించగలదు. అయినా, అన్ని జట్లు సమర్థంగా పోటీ చేస్తాయి. ప్రపంచంలో మరో దేశం ఇలా చేయలేరు” అని పేర్కొన్నాడు.
భారతదేశం ఈ స్థాయికి చేరడానికి ఐపీఎల్ ప్రధాన కారణమా? అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇవ్వకపోయినప్పటికీ, “ఐపీఎల్ ప్రపంచంలో అత్యుత్తమ లీగ్, భారత ఆటగాళ్లు అందరూ ఇందులో ఆడతారు. ఇది భారత క్రికెట్కు మరింత బలం అందిస్తోంది” అని చెప్పాడు.