ఐపీఎల్లో అత్యధిక ఫైనల్స్ ఆడిన ఆటగాళ్లు ఎవరు?
March 24, 2025

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2008లో ప్రారంభమైనప్పటి నుంచి అనేక మంది ఆటగాళ్లు తమ ప్రతిభను ప్రదర్శించారు. అయితే, అత్యధిక ఫైనల్స్ ఆడిన ఆటగాళ్ల జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) దిగ్గజ కెప్టెన్ ఎమ్ఎస్ ధోనీ అగ్రస్థానంలో ఉన్నాడు. 2024 సీజన్ వరకు ధోనీ 11 ఫైనల్స్ లో పాల్గొన్నాడు. CSKతో పాటు, 2017లో రైజింగ్ పుణే సూపర్జెయింట్స్ తరఫున కూడా ఫైనల్ ఆడాడు.
ధోనీ తర్వాత రవీంద్ర జడేజా, సురేశ్ రైనా, అంబటి రాయుడు ఈ జాబితాలో 8 ఫైనల్స్తో రెండో స్థానంలో ఉన్నారు. రవిచంద్రన్ అశ్విన్, డ్వైన్ బ్రావో 7 ఫైనల్స్ ఆడగా, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, రోహిత్ శర్మ 6 ఫైనల్స్ ఆడారు. వీరంతా తమ జట్ల విజయాల్లో కీలక పాత్ర పోషించారు. వీరి తర్వాత సుబ్రమణ్యం బద్రీనాథ్, లసిత్ మలింగ, అల్బీ మోర్కెల్ 5 ఫైనల్స్ ఆడిన ఆటగాళ్లుగా నిలిచారు.