ఉగాదికి ప్రభుత్వం భోగి కానుక!
March 26, 2025

రేషన్ కార్డు కలిగిన వారికి సన్నబియ్యం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఉగాది పండగ రోజున సాయంత్రం 6 గంటలకు హుజూర్నగర్లో సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఆ మరుసటి రోజు నుంచి అంటే ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ ప్రారంభం కానుంది.
ఈ పథకం అమలుతో రాష్ట్రంలోని 2.82 కోట్ల మందికి లబ్ధి కలిగే అవకాశం ఉంది. ప్రస్తుతం రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం పంపిణీ జరుగుతోంది. ఇకపై సన్నబియ్యం ద్వారా ప్రజలకు మెరుగైన నాణ్యత కలిగిన బియ్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇది పేద ప్రజలకు మంచి మేలు చేయనుంది.