ఆసియా కప్లో మళ్ళీ భారత్-పాకిస్థాన్ మ్యాచ్? తేదీ ఖరారు, ఆ రోజున మరో హై-వోల్టేజ్ పోరు!
September 16, 2025

ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్థాన్ల మధ్య మరో హై-వోల్టేజ్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే భారత్ సూపర్ 4కి అర్హత సాధించగా, పాకిస్థాన్ కూడా ఈ రేసులో ఉంది. ఆదివారం జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ను 7 వికెట్ల తేడాతో ఓడించి సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమ్ ఇండియా గ్రూప్ దశలో తన స్థానాన్ని పటిష్టం చేసుకుంది.
భారత్ ఇప్పటివరకు రెండు మ్యాచ్లలో గెలిచి 4 పాయింట్లు సాధించింది. పాకిస్థాన్ రెండు మ్యాచ్లలో ఒక గెలుపు, ఒక ఓటమితో 2 పాయింట్లను కలిగి ఉంది. సెప్టెంబర్ 17న జరగబోయే మ్యాచ్లో పాకిస్థాన్ యూఏఈని ఓడిస్తే, అది సూపర్ 4కి చేరుకుంటుంది. అలా జరిగితే, సెప్టెంబర్ 21న సూపర్ 4లో రెండవ మ్యాచ్లో భారత్, పాకిస్థాన్ తలపడతాయి. ఒకవేళ పాకిస్థాన్ ఓడిపోతే, భారత్ యూఏఈతో ఆడుతుంది.