అసెంబ్లీలో అగ్నిప్రేమ వ్యాఖ్యల కలకలం! మైనారిటీలపై విమర్శలు: ఫిర్హాద్ హకీం ఘాటు రిటార్ట్!
February 6, 2026

మదర్సా విద్యకు బడ్జెట్ కేటాయింపులపై బీజేపీ ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్ చేసిన వ్యాఖ్యలు బెంగాల్ అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఈ నిధులు నేరగాళ్లను తయారు చేయడానికేనా అని ఆమె ప్రశ్నించారు. దీనిపై అధికార పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో, స్పీకర్ ఆ వివాదాస్పద వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగించాలని ఆదేశించారు.
మంత్రి ఫిర్హాద్ హకీం స్పందిస్తూ, “మేము నేరస్థులం కాదు” అని ఉద్వేగంగా అన్నారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో మైనారిటీల త్యాగాలను గుర్తు చేస్తూ, ఏపీజే అబ్దుల్ కలాం వంటి వారిని కూడా నేరస్థులుగా చూస్తారా అని నిలదీశారు. ఈ క్రమంలో అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగి సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.