అమెరికాతో భారత్ ఢీ! వాంఖడే వేదికగా టీ20 ప్రపంచకప్ సమరం – టీమ్ ఇండియా తుది జట్టు ఇదే!

అమెరికాతో భారత్ ఢీ! వాంఖడే వేదికగా టీ20 ప్రపంచకప్ సమరం – టీమ్ ఇండియా తుది జట్టు ఇదే!

టీ20 ప్రపంచకప్ వేటలో నేడు ముంబై వాంఖడే స్టేడియంలో అమెరికాతో భారత్ తలపడనుంది. పాకిస్థాన్‌ను ఓడించిన అమెరికాను తక్కువ అంచనా వేయలేమని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అభిప్రాయపడ్డారు. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా రానుండగా, స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్‌లకు చోటు దక్కనుంది. పేస్ విభాగంలో బూమ్రా, అర్ష్‌దీప్ సింగ్ కీలకం కానున్నారు.

మ్యాచ్‌కు ముందు బాద్షా, నోరా ఫతేహిల ప్రదర్శనతో అట్టహాసంగా ప్రారంభోత్సవ వేడుకలు జరగనున్నాయి. రోహిత్ శర్మ, జై షా ప్రపంచకప్ ట్రోఫీని మైదానంలోకి తీసుకురానున్నారు. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్‌తో బరిలోకి దిగుతున్న భారత్, ఈ మెగా టోర్నీలో బోణి కొట్టాలని పట్టుదలతో ఉంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *