అజిత్ పవార్ విమాన ప్రమాదం రాజీవ్ గాంధీ తరహా హత్యేనా ఎన్సీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
February 23, 2026

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదం వెనుక పెను కుట్ర దాగి ఉందంటూ ఎన్సీపీ (ఎస్పీ) ఎమ్మెల్యే అమోల్ మిట్కరీ సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య తరహాలోనే ఈ ప్రమాదం జరిగిందా అని ఆయన ప్రశ్నించారు. పైలట్ సుమిత్ కపూర్ ఆత్మహుతి బాంబర్గా వచ్చారా అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ, విమాన బ్లాక్ బాక్స్ డేటా మరియు సీసీటీవీ దృశ్యాలను ఎందుకు బయటపెట్టలేదని నిలదీశారు.
ఈ ఆరోపణల నేపథ్యంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ, ఈ ప్రమాదంపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరినట్లు తెలిపారు. ఇప్పటికే సీఐడీ మరియు డీజీసీఏ విచారణ కొనసాగుతుండగా, ఇప్పుడు సీబీఐ కూడా రంగంలోకి దిగి ఈ ప్రమాదం వెనుక ఉన్న మిస్టరీని ఛేదిస్తుందని ఆయన స్పష్టం చేశారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ వ్యవహారం పెను దుమారం రేపుతోంది.